ఇళయరాజా పద్మవిభూషణ్ కు, కులానికి లింక్.. మండిపడుతున్న అభిమానులు!

  • ఇళయరాజాకు పద్మవిభూషణ్ పై ఓ పత్రిక దారుణ కథనం
  • పద్మ అవార్డుల్లో కులం పాత్ర అనే విధంగా కథనం
  • మండిపడుతున్న అభిమానులు
తన మధుర సంగీతంతో ఎన్నో ఏళ్లుగా అభిమానులను మైమరపించిన సంగీత సామ్రాట్ ఇళయరాజాకు భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన అభిమానులు పులకించిపోయారు. విభేదాలను సైతం పక్కనపెట్టి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన స్పందనను వ్యక్తం చేశారు. 'ఇళయరాజాను వరించి పద్మవిభూషణ్ గుర్తింపు పొందింది' అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఇలాంటి తరుణంలో ఓ పత్రిక రాసిన ఓ కథనం ఆయన అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. 'దళిత్ ఔట్ రీచ్ విత్ ఇళయరాజాస్ పద్మ' అంటూ ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పద్మ అవార్డుల్లో కులం పాత్ర అనే సారాంశంతో ఆ కథనం ఉంది. దీనిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. రాజా ప్రతిభను కులంతో ముడిపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కులాన్ని చూసే రాజాను భారత ప్రభుత్వం సత్కరించిందా? అంటూ మండిపడుతున్నారు.
Go Back to Shorts
ilayaraja
padmavibhushan

More Telugu News